Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

నా తండ్రి చనిపోలేదు.. బతికుండగానే చంపేయొద్దు: ముఖేశ్ గౌడ్ కుమారుడు

తికుండగానే తన తండ్రిని చంపేయొద్దంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన తండ్రి చనిపోలేదని చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్‌ (60)ను ఆదివారం (జులై 28) రాత్రి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆదివారం రాత్రి కొన్ని న్యూస్ ఛానెళ్లు ముఖేశ్ గౌడ్ ఇకలేరని స్క్రోలింగ్ వేశాయి. కొన్ని వెబ్‌సైట్లలో వార్తా కథనాలు కూడా ప్రచురించారు. ఈ నేపథ్యంలో విక్రమ్ గౌడ్ స్పందించారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు, వెబ్‌సైట్ల తప్పుడు కథనాల కారణంగా బంధుమిత్రులు, అభిమానుల నుంచి తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని విక్రమ్ గౌడ్ తెలిపారు. తన తండ్రి చనిపోలేదని.. అలాంటి తప్పుడు కథనాలు రాయొద్దని వేడుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. Read Also: అపోలో వైద్యులు తన తండ్రికి చికిత్స అందిస్తున్నారని.. ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందని విక్రమ్ గౌడ్ తెలిపారు. ముఖేశ్‌ గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం మారడంతో నాలుగు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానూ తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్.. అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేశ్‌ గౌడ్.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K1ryDy

No comments:

Post a Comment