Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

'నేనూ మీ సోదరి షర్మిలగారి' వంటి వాడినే జగన్ గారూ: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు కాపు ఉద్యమ నేత లేఖ రాశారు. ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్లపై ఏ కోర్టు స్టే ఇచ్చిందో జగన్ చెప్పాలన్నారు. కోర్టు స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చే వరకు తమ డిమాండ్లు హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తామన్న రూ.2వేల కోట్లకు ఆశపడి కాపులు మీకు ఓటేశారని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇక ముద్రగడ తన లేఖలో సీఎం జగన్ సోదరి షర్మిల పేరును ప్రస్తావించారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అయ్యా.. ఆ మధ్య తమరి సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో బూతులు ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అని ఎన్నో బూతులు అన్ని పార్టీల వారు రాయిస్తున్నారు. వాటికి బెదిరిపోవడానికి నేనేమీ ఎన్ఆర్ఐను కాదండి. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిలగారి లాంటివాడినే అని గ్రహించమని కోరుతున్నాను’ అన్నారు ముద్రగడ. ఇక 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి తీరుతానని జగన్ అన్నారని.. కానీ లోక్‌సభలో ఆర్థిక, హోం మంత్రిగారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం లాంటిదని చెప్పారని గుర్తు చేశారు. మడమతిప్పని మీరు కనీసం హోదా గురించి పట్టించుకోకుండా బానిసలు బతుకుతున్న కాపు జాతి ఆశలపై నీళ్లు చల్లడం తగునా ముఖ్యమంత్రి గారూ..? అంటూ ప్రశ్నించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K8qkVW

No comments:

Post a Comment