Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

బలపరీక్షలో యడ్డీ విజయం.. స్పీకర్ రాజీనామా!

బలపరీక్షలో ముఖ్యమంత్రి విజయం సాధించారు. బలపరీక్షలో బీజేపీకి 106 ఓట్లు లభించాయి. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్యను బట్టి సాధారణ మెజార్టీ కంటే రెండు ఓట్లు ఎక్కువ రావడంతో యడ్యూరప్ప బలపరీక్షలో గెలుపొందారు. మూజువాణి ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో యడ్డీ నెగ్గినట్లు స్పీకర్‌ రమేశ్‌కుమార్ ప్రకటించారు. రాజీనామాలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 224 కాగా, 17 మందిపై అనర్హత వేటు వేయడంతో 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు మేజిక్‌ ఫిగర్‌ 104 కాగా, బీజేపీకి సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో యడ్డీ విజయం లాంఛనమైంది. మరోవైపు, విశ్వాస పరీక్ష ముగిసిన వెంటన స్పీకర్ రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఆదివారం నుంచి కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా స్పీకర్ తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు. మరోవైపు, స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్నిఆశ్రయించారు. తమపై 2023 వరకు అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌ శంకర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జులై తొలి వారంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన వీరిపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ చర్యలు తీసుకున్నారు. తొలుత జులై 25న వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసిన స్పీకర్, ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశఆరు. దీంతో స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారు సుప్రీం మెట్లెక్కారు. ఇప్పటికే రాజీనామా అంశానికి సంబంధించి రెండు పిటిషన్లు సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడీ పిటిషన్‌ కూడా తోడవ్వడంతో వీటన్నింటిపై సుప్రీం త్వరలో విచారణ చేపట్టనుంది. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి కాంగ్రెస్, జేడీఎస్‌లు చేసిన ప్రయత్నాలు విఫలమవడం, పార్టీ నేతల విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దీంతో సభలో సభ్యుల సంఖ్య 207కు చేరుకుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GurBWf

No comments:

Post a Comment