Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 24 February 2020

ట్రంప్‌తో విందు.. కేసీఆర్‌కు ఆహ్వానం, జగన్‌ను ఎందుకు..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం సాయంత్రం కోవింద్ విందు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విందుకు కొద్ది మంది నేతలకే ఆహ్వానం దక్కింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్ తదితరులకు ఆహ్వానం దక్కలేదు. 8 మంది సీఎంలకు మాత్రమే ఆహ్వానం దక్కింది. బిహార్, ఒడిశా, హర్యానా, అసోం, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలకు మాత్రమే ఈ విందులో పాల్గొనేందుకు ఆహ్వానం పంపారు. దక్షిణాదిన ఉన్న మూడు రాష్ట్రాల సీఎంలకు అవకాశం ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు ఆహ్వానం అందకపోవడం పట్ల రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ పరిమిత సంఖ్యలోనే వీఐపీలను ఆహ్వానించే ఉద్దేశంతో చాలా మంది సీఎంలను ఆహ్వానించ లేదని తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే దక్షిణాది నుంచి ముగ్గురు సీఎంలకు ఆహ్వానం అందిందని తెలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కావడంతో.. మహారాష్ట్ర సీఎంను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారట. ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలో అమెరికా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హర్యానా సీఎంకు అవకాశం కల్పించారట. 2017లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కోసం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం ఆమెకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇవాంకాకు భారత సర్కారు విందు ఇచ్చింది. తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని చాటే బహుమతులను అందజేశారు. దీంతో అమెరికా వెళ్లాక.. తెలంగాణ సీఎంకు థ్యాంక్స్ చెబుతూ ఇవాంకా లేఖ రాశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3a20UV1

No comments:

Post a Comment