Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday 4 February 2020

నెల్లూరు జిల్లాలో ప్రేమజంట అఘాయిత్యం.. పోలీసుల ఎదుటే

తెలిసీ తెలియని వయస్సులోనే వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో ఇంటి నుంచి పారిపోయారు. పెద్దల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. అయితే పోలీసుల భయంలో ఆ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశారు. ఈ ఘటన జిల్లాలో జరిగింది. Also Read: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలానికి చెందిన సయ్యద్‌ ఖాదర్‌ బాషా అనే యువకుడు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి చదువుతున్న బాలిక ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తమను విడదీస్తారన్న భయంతో ఇంటి నుంచి పారిపోయారు. దీంతో బాలిక కుటుంబసభ్యులు ఉలవపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా వారు సీతారామపురం నుంచి ఒంగోలు వైపు బైక్‌పై వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ఉలవపాడు పోలీసులు సీతారామపురం ఎస్సైకు సమాచారం అందించారు. Also Read: దీంతో పోలీసులు పబ్బులేటిపల్లి వద్ద ప్రేమజంటను ఆపి వివరాలు ఆరా తీశారు. దీంతో కంగారుపడిన ప్రేమికులు వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేశారు. పోలీసులు వారిద్దరిని తమ వాహనంలో సీతారామపురానికి తీసుకొచ్చి అక్కడి నుంచి 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రేమజంట పూర్తిగా కోలుకున్నాక దీనిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/395rJr5

No comments:

Post a Comment