నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులైన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్లు శుక్రవారం తెల్లవారు జామున కొయ్యకు వేలాడిన సంగతి తెలిసిందే. మీరఠ్ నుంచి వచ్చిన తలారీ పవన్ జలాద్ అనే వ్యక్తి తీహాడ్ జైలులో వారిని ఉరి తీశారు. జైలు నెంబర్ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి ప్రక్రియ పూర్తయ్యాక, దోషుల మృతదేహాలను పరీక్షించిన వైద్యులు ఆ నలుగురు చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వాటిని డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేస్తారు. Also Read: అయితే, తీతకు ఓ ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఇంత మందిని ఒకేసారి, అదీ ఒకే చోట మరణ శిక్ష విధించలేదు. ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరి తీయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే, గత నాలుగేళ్లుగా భారత్లో ఉరి శిక్షలేమీ అమలు కావడం లేదు. 1990ల్లో ముంబయిపై బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఘటనలో నిధులు సమకూర్చినందుకు యకూబ్ మెమన్ను 2015లో ఉరితీశారు. ఆ తర్వాత మళ్లీ అమలైన ఉరి శిక్ష నిర్భయ దోషులదే. Also Read: 2012 డిసెంబర్ 16న దిల్లీ నడి మధ్యన అర్థరాత్రి సమయంలో ఆరుగురు వ్యక్తులు నిర్భయ అనే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి ఒడిగట్టారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెకు తోడుగా ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో నిర్భయను సింగపూర్కు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. నిందితులైన రామ్సింగ్, వినయ్ శర్మ, అక్షయ్, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహాడ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతణ్ని విడుదల చేశారు. నేరం జరిగిన ఏడు సంవత్సరాల 3 నెలల 4 రోజుల తర్వాత శుక్రవారం (మార్చి 20) ఉదయం 5.30 గంటలకు మిగిలిన నిందితులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్కు ఉరి శిక్ష అమలైంది. Must Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33yUURN
0 Comments