మహా సర్కార్ షాకింగ్ డెసిషన్.. కోవిడ్ నిషేధాజ్ఞలు.!

రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు వారాంతంలో లాక్‌డౌన్ విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడుగంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అలాగే వీకెండ్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలన నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్ అమలు చేయనుంది. మహా సర్కార్ బాలీవుడ్‌కి సైతం షాకిచ్చింది. పార్కులు, సినిమా హాళ్లు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు సినిమా షూటింగులను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూర్చుని తినడంపై ఆంక్షలు విధించింది. పార్శిల్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సోమవారం రాత్రి నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి. అత్యవసర సర్వీసులను అనుమతిస్తారు. అయితే మహా సీఎం ఉద్దవ్ థాకరే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ విలయతాండవం చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతు కోరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఉంటుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mjN9Z9

Post a Comment

0 Comments