ఉగ్రవాద సంస్థ అగ్రనేత ఐమన్ అల్-జవహరీ ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయినట్టు వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. తాజాగా, అల్-జవహరీ మళ్లీ ఓ వీడియోలో కనిపించి పలు అంశాలపై మాట్లాడటం కలకలం రేగుతోంది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి జరిగి 20 ఏళ్లు పూర్తయిన వేళ అతడి వీడియో బయటపడటం గమనార్హం. 9/11 దాడుల స్మారకదినం సందర్భంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘సైట్’ ఇంటెలిజెన్స్ గ్రూప్ శనివారం ఈ వీడియోను విడుదల చేసింది. జిహాదీల ఆన్లైన్ కార్యకలాపాలపై ఈ సంస్థ నిఘా ఉంచుతుంది. ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సైన్యం హతమార్చిన తర్వాత ఐమన్ అల్ జవహరీ అల్ఖైదా పగ్గాలు చేపట్టారు. ‘చనిపోయినట్టు చెబుతున్న అల్ఖైదా నేత ఐమన్ అల్- జవహరీని 60 నిమిషాల నిడివున్న తాజా వీడియోలో చూడవచ్చు.. ఈసారి స్పష్టంగా కనిపిస్తున్న కొన్ని ఆధారాల కారణంగా అతడు చనిపోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.. చనిపోయాడని ప్రచారం జరిగిన తర్వాత గత డిసెంబరు నుంచి జరిగిన కొన్ని పరిణామాలే ఇందుకు నిదర్శనం’ అని ‘’ డైరెక్టర్ రీటా కట్జ్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ‘జెరూసలేం యూదుల పరం కాబోదు’ అంటూ మొదలుపెట్టి.. సిరియాలోని రష్యన్ మిలటరీ శిబిరంపై అల్ఖైదా అనుబంధ సంస్థ జనవరి 1న జరిపిన హుర్రాస్ అల్-దీన్ దాడి గురించి జవహరీ మాట్లాడటం స్పష్టంగా తెలుస్తోంది. తాలిబన్ సేనలను చూపుతున్న అఫ్గన్ మీడియా క్లిప్పింగుల కూడా ఉన్న ఈ వీడియోలో ‘ఆయన్ను భగవంతుడు కాపాడు గాక’ అంటూ జవహరీ పరిచయ వాక్యాల్లో చెప్పడం వినిపిస్తుంది. ‘అఫ్గన్లో తాలిబన్ల విజయం అల్ఖైదా విజయమే. 9/11 తర్వాత ప్రపంచ జిహాదీ ఉద్యమంలో తాలిబన్ల పాత్ర, ప్రాముఖ్యతకు ఇది మరో నిదర్శనం’ అని కట్జ్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘అల్ఖైదా అనుకూల మీడియా 9/11 దాడుల స్మారక సందర్భాన్ని ఓ వేడుకలా జరుపుకొంటూ పోస్టర్లు, వీడియోలు విడుదల చేసినట్టుంది. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏదిఏమైనప్పటికీ అల్-ఖైదా అధికారిక మీడియా విభాగం అస్-సాహబ్ కొత్త వీడియో విడుదలపై ఓ ప్రకటన చేసింది. ఈ వీడియో నేడో రేపో విడుదల కానుంది. జవహరీ రాసిన ఓ పుస్తకంలోని భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో అస్-సాహబ్ విడుదల చేసింది. మొత్తం 852 పేజీల ఈ పుస్తకాన్ని జీహాదీలో చనిపోయిన అల్-ఖైదా కార్యకర్తలకు అంకితం ఇచ్చినట్టు ప్రకటించింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3AaaYJ2
0 Comments