గుజరాత్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది గడువు మాత్రమే ఉండగా.. విజయ్ రూపానీ తన పదవి నుంచి తప్పుకుని రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. తన రాజీనామా లేఖను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్కు శనివారం మధ్యాహ్నం సమర్పించారు. గాంధీనగర్లో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత గుజరాత్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామాను సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఆకస్మిక రాజీనామా వెనుక కారణాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను.. అదే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో నాయకత్వ మార్పు అనేది చాలా సహజమైన విషయమని రూపానీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నాయకత్వంలో తాను పనిచేస్తానని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో బీజేపీపై ప్రజల తమ విశ్వాసాన్ని పదేపదే నిలబెట్టుకున్నారని రూపానీ తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో అప్పటి వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన స్థానంలో అనందీ బెన్ పటేల్కు పగ్గాలు అప్పగించారు. అయితే, రెండేళ్లకే ఆమెను తప్పించి 2016 ఆగస్టులో విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా నియమించారు. 2017 ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో విజయ్ రూపానీయే తిరిగి సీఎం అయ్యారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/2YNRfkP
0 Comments