Mumbai అత్యాచారం చేసి రహస్య భాగాల్లోకి ఐరన్ రాడ్లు చొప్పించి.. నిర్భయ తరహా ఘటన

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై కదులుతున్న టెంపోలోనే అత్యాచారం చేసి, ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. మహిళ ప్రయివేట్ భాగాల్లోకి ఐరన్ రాడ్లను చొప్పించి క్రూరంగా వ్యవహరించారు. ఈ ఘటన సాకినాకా సబర్బన్‌లో చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని గుర్తించి పోలీసులకు శుక్రవారం తెల్లవారుజామున ఎవరో ఫోన్ చేశారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి వయసు 32 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం రహస్య అవయవాలపై రాడ్డుతో దాడి చేసి నడి రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సాకినాకా ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో రహదారిపై ఓ మహిళ రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉందని, ఆమెను ఎవరో కొడుతున్నారని ప్రధాన కాల్‌ సెంటర్‌కు సమాచారం వచ్చిందని చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం రాజావాడీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న మోహన్ చౌహన్ (45) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో మరికొందరి పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టెంపో వాహనంలో మహిళపై అత్యాచారం చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఆ వాహనంలోనూ రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులకు వివరించారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా తెలియరాలేదు. మరోవైపు, ఆ ప్రాంత డీసీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అదుపులోకి తీసుకున్న నిదింతుడిపై హత్యాయత్నం, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3txIw1d

Post a Comment

0 Comments