టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎన్నికల ఖర్చుపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. కోర్టులో దాఖలైన పిటిషన్పై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రావని తెలిపింది. ఆయనకు ఎన్నికలతో సంబంధం లేదని.. పోటీ చేయలేదని స్పష్టత ఇచ్చింది. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ కూడా నివేదిక ఇచ్చారని.. ఎన్నికల ఖర్చుపై ఆయన అభిప్రాయాన్ని చెప్పారంటోంది. సీఈసీ వివరణను ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కు తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసింది.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.. పిటిషన్ను కొనసాగించాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించింది. జేసీ దివాకర్ రెడ్డి అభ్యర్థిగా లేకపోయినా.. ఆయన కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా పోటీచేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కుమారుడి కోసం డబ్బు జేసీ ఖర్చు చేశారన్నారు. పిటిషనర్ వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో ప్రతివాదిగా దివాకర్ రెడ్డికి బదులు ఆయన కుమారుడు పవన్ రెడ్డిని చేర్చాలని సూచించింది. నాలుగు వారాల్లోగా పిటిషన్ను సవరించి దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసులో జేసీకి ఊరట దొరికినా.. ఆయన కుమారుడు పవన్కు కష్టాలు తప్పేలా లేవు. నాలుగు వారాల తర్వాత ఈ కేసు విచారణ జరగనుంది. ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి.. ఒక్కో అభ్యర్థి రూ.50 కోట్లకు తగ్గకుండా ఖర్చు చేశారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనే కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LO8FG8
0 Comments