మహారాష్ట్రలోని సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో 9మంది కాలేజీ స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. పుణె సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు రాయ్గఢ్ పర్యటనకు వెళ్లారు. అనంతరం తిరుగొస్తుండగా పుణె-షోలాపూర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు కదంవక్ వాస్తి గ్రామ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న ట్రక్కులోకి దూసుకెళ్లింది. Also Read: ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2M1dZ8v
No comments:
Post a Comment