Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 19 July 2019

Maharastra: కారు-ట్రక్కు ఢీకొని 9మంది విద్యార్థుల మృతి

మహారాష్ట్రలోని సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో 9మంది కాలేజీ స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. పుణె సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు రాయ్‌గఢ్ పర్యటనకు వెళ్లారు. అనంతరం తిరుగొస్తుండగా పుణె-షోలాపూర్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు కదంవక్ వాస్తి గ్రామ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న ట్రక్కులోకి దూసుకెళ్లింది. Also Read: ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2M1dZ8v

No comments:

Post a Comment