కులాంతర వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ నగరంలో బుధవారం జరిగింది. పెదవాల్తేరు పోలమాంబ దేవాలయం సమీపంలో నివాసముంటున్న యువతి (20), డాబాగార్డెన్స్కు చెందిన ఓ యువకుడు కొన్నా్ళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి సామాజిక వర్గాలు వేరుకావడంతో ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. Also Read: నాలుగు రోజుల క్రితం ఆ యువకుడు ప్రియురాలి నివాసానికి వెళ్లి తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి పెళ్లి చేయాలని కోరాడు. దీనికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు అతడిని మందలించి పంపేశారు. ఆ తర్వాత వారి ఇంట్లో గొడవలు కావడంతో యువతి మనస్తాపానికి గురైంది. బుధవారం మద్దిలపాలెంలోని సొంతింటికి వచ్చిన ఆమె మేడపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vRMKHa
0 Comments