ఫేస్‌బుక్ పెళ్లి.. మూడు నెలలు కాపురం చేసి పరారైన యువకుడు

ఫేస్‌బుక్‌లో యువతికి గాలం వేసిన ఓ యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: రంగారెడ్డిజిల్లా చేవెళ్ల మండలం, రావులపల్లికి చెందిన గజ్జెల రాజేందర్‌గౌడ్‌ అలియాస్‌ రాజేందర్‌(28) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో నేరేడ్‌మెట్‌కు చెందిన ఓ యువతి(20)ని పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో యువతి అతడి మాటలు నమ్మింది. Also Read: మూడు నెలల క్రితం రాజేందర్‌ తల్లిదండ్రులకు తెలియకుండా తన ఫ్రెండ్స్‌ సమక్షంలో దండలు మార్చుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నేరేడ్‌మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆమెతో కాపురం మొదలుపెట్టాడు. మూడు నెలల తర్వాత ఆమెపై మోజు తీరడంతో పెద్దలను ఒప్పించి వస్తానంటూ వెళ్లాడు. ఎన్నిరోజులైనా అతడు తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఫోన్ చేయగా.. పెళ్లిని తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని విడిపోదామని చెప్పాడు. ఆమె గట్టిగా నిలదీయగా ఇద్దరికీ సంబంధమే లేదని ప్లేటు ఫిరాయించాడు. మోసపోయానని గ్రహించిన యువతి మంగళవారం నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vRWsJC

Post a Comment

0 Comments