కూతురు రాత్రి 12 గంటల వరకు ఎవరితో ఉందో తెలియదా.. నిర్భయ తల్లిపై దారుణంగా..

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష పడింది. చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ కేసు ఎట్టకేలకు ముగిసింది. నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడంతో నిర్భయ తల్లిదండ్రులతో పాటూ యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. తీహార్ జైలు బయట, దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుని.. బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అందరూ ఉరి శిక్ష వేయడాన్ని స్వాగతిస్తే.. దోషుల తరపు లాయర్ తన ఫ్రస్టేషన్‌తో కనిపించాడు. Read Also: కేసు ఓడిపోవడంతో కనీసం నలుగురు దోషుల్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. అయితే లాయర్ ఏపీ సింగ్ నిర్భయ తల్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నలుగురు దోషులకు వత్తాసు పలుకుతూ.. ఆమెను శిక్షించాలంటూ వ్యాఖ్యలు చేశాడు. నిర్భయ తల్లిని ప్రస్తావిస్తూ.. తన కూతురు ఎక్కడుందో.. రాత్రి 12 గంటల వరకు ఎవరితో ఉందో తెలియదని.. తప్పు ఆమెది.. ఆమెనుశిక్షించాలన్నాడు. ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ నలుగురితో పాటూ లాయర్‌ను కూడా ఉరి తీస్తే బావుండేది అంటున్నారు. కొందరు వీడేం మనిషి.. చట్టాల్లో లొసుగులతో ఏడేళ్ల పాటూ కోర్టుల్లో కేసును నాన్చారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలించిందన్నారు. ఇది నిర్భయకు అసలైన నివాళి అంటున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2U45ZXN

Post a Comment

0 Comments