దేశంలో 324కు చేరిన కరోనా కేసులు.. ముంబైలో మరో వ్యక్తి మృతి

దేశంలో మరో వ్యక్తి కారణంగా మృతిచెందాడు. దీంతో దేశంలో కరోనా మరణాలు సంఖ్య ఐదుకు చేరింది. ముంబైకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో చనిపోయాడు. మహారాష్ట్రలో ఇది రెండో కరోనా మరణం. ప్రస్తుతం దేశంలోనే కరోనా వైరస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 74కు చేరుకోగా.. శనివారం సాయంత్రం నుంచి కోవిడ్ బాధితులు పెరిగినట్టు పీటీఐ తెలిపింది. మొత్తం దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 324కి చేరింది. ఓవైపు, కరోనా వైరస్‌ను అడ్డుకోడానికి దేశంలో 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తించెందుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నాటికి దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 324కు చేరింది. మొత్తం 22 రాష్ట్రాల్లో ఈ వైరస్‌ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కొత్తగా మరో 9 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్రం వెల్లడించాల్సి ఉంది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో పలు ఆంక్షలు విధించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 27కు చేరింది. ఆంక్షల కారణంగా పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకాకుండా వచ్చే నెల చౌకధరల దుకాణాల్లో సరుకులు 50శాతం అధికంగా పొందవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UmrMcg

Post a Comment

0 Comments