కాశీలో తొలి కరోనా కేసు... గ్రామం మొత్తం బంద్

ఉత్తర్ ప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వారణాసి జిల్లాలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. దుబాయ్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది. దీంతో అతడు ఉంటున్న గ్రామమొత్తం లాక్ డౌన్ చేశారు అధికారులు. కరోనా బాధితునికి దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఫూల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛితౌరా సహమల్‌పూర్ గ్రామానికి చెందినవాడు. దీంతో గ్రామంలోనివారందరికీ జిల్లా యంత్రాంగం థర్మల్ స్కానింగ్ చేయిస్తోంది. మరోవైపు బాధితుని కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామం మొత్తాన్ని లాక్‌డౌన్ చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాధితుడు మార్చి 17 న దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తొంది. అక్కడి నుంచి రైలు ద్వారా 18న వారణాసి చేరుకున్నాడు. తరువాత టెంపోలో గ్రామానికి వచ్చాడు. గొంతు నొప్పితో బాధపడుతూ 19న దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన నేపధ్యంలో ఆ యువకునికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాధితుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యూపీ సర్కార్ కరోనా నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా వైరస్ తో రోజు కూలి కార్మికులకు రూ. 1000 అందిస్తామన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. 15 లక్షల మంది రోజుకూలీ కార్మికులకు, 20.37 లక్షల మంది నిర్మాణ కార్మికులకు వెయ్యి రూపాయిల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో రోజుకూలీ చేసుకునే కార్మికులను, నిర్మాణ రంగంలోని కార్మికులను ఆదుకోవడానికి ఈ సహాయం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33zzXWX

Post a Comment

0 Comments