పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తి స్టీల్ సిటీలో అలజడి రేపింది. పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి పరారవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటన ప్రశాంతంగా ఉన్న విశాఖ ప్రజలను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది అమానుషంగా చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. Also Read: స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్రైం స్పాట్కి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడింది. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3djac1p
0 Comments