Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 1 November 2020

దీపావళి వేళ రాజస్థాన్ సంచలన నిర్ణయం.. బాణాసంచా విక్రయాలపై నిషేధం!

దీపావళి పండుగ వేళ టపాసుల విక్రయంపై రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. తన నివాసంలో సోమవారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ.. టపాసుల విక్రయ లైసెన్సుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. టపాసులు కాల్చినపుడు వెలువడే పొగ వల్ల కొవిడ్-19 బాధితులు సహా గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు ఇబ్బందులు పడతారని, అందువల్ల దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచాకు దూరంగా ఉండాలని అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి విజృంభణ ప్రారంభమైందని, దీనివల్ల పలు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడకుండా ఉండాలంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ల వెలిగే సమయంలో ఇంజిన్ ఆఫ్ చేయాలని వాహనదారులకు గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2 వేల మంది వైద్యుల నియామక ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని, ఎంపికైనవారికి 10 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం సూచించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి కాలుష్యం పెరుగుతున్న వేళ రాజస్థాన్ సీఎం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గత పది రోజులుగా రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్య నియంత్రణకు కేంద్రం ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/35Skz9H

No comments:

Post a Comment