Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 1 November 2020

కోవిడ్ నిర్ధారణ అయిన వ్యక్తితో కాంటాక్ట్.. స్వీయ నిర్బంధంలోకి డబ్ల్యూహెచ్ఓ చీఫ్

తనతో కాంటాక్ట్ అయిన వ్యక్తికి నిర్దారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధ్నోమ్ ఘోబ్రియోసిస్ క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే, తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని పేర్కొన్నారు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిని ఇటీవల తాను కలిసినట్లు స్వయంగా ట్విటర్‌ వేదికగా ఆయన వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం.. కొన్ని రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రజారోగ్య నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గొలుసును తెంచడం, వైరస్‌ను నియంత్రించడం, ఆరోగ్య వ్యవస్థలను సంరక్షించుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం టెడ్రోస్‌ నేతృత్వంలో డబ్ల్యూహెచ్‌వో విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి కట్టడితో పాటు వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయంలో వివిధ దేశాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తోంది. పేద దేశాలకు వ్యాక్సిన్‌, ఔషధాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని డబ్ల్యూహెచ్ఓ పదే పదే చెబుతోన్న విషయం తెలిసిందే. మహమ్మారి రెండోసారి విజృంభించడంతో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ తదితర ఐరోపా దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించారు. అత్యవసర దుకాణాలు, సంస్థలు మినహా మిగతావి మూసివేయాలని ఆయా దేశాలు ఆంక్షలు విధించాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3eg3WbA

No comments:

Post a Comment