Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 December 2020

వెంటాడుతున్న కొత్త కరోనా భయం..కర్ణాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ

భయంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. బ్రిటన్‌లో ఈ మహమ్మారి రూపం మార్చుకుని విజృంభించడంతో ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై భారత్ డిసెంబరు 31 వరకు నిషేధం విధించింది. ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన వివిధ నగరాల్లోని 25 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో కేంద్రం కీలక సూచనలు చేసింది. నవంబరు 25 తర్వాత యూకే నుంచి, ఆ దేశం మీదుగా వచ్చిన ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాల పరిధిలోకి చేర్చింది. మరోవైపు, కొత్తరకం స్ట్రెయిన్‌పై పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. తాజాగా ఆ జాబితాలో కర్ణాటక కూడా చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 2 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజల ఎవరూ బయట తిరగవద్దని సూచించింది. ఈ నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాలని, ఎవరైనా వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రయాణికుల వివరాలు ఇవ్వాలని బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను కోరింది. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ముంబై సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సోమవారం సాయంత్రం ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. జనవరి 5 వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌లో వెలుగుచూసిన వైవిధ్యం అంటువ్యాధిగా మారి, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2WHeHM5

No comments:

Post a Comment