Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday 23 September 2020

విజృంభిస్తోన్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. 12 వేల పందులను చంపడానికి సిద్ధమైన అసోం!

అసోంలో ఆఫ్రికన్ సైన్‌ ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో 12 వేల పందులను చంపేయాలని అసోం ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. దీనిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ విధంగా పందులను చంపినపుడు వాటి యజమానులకు పరిహారం చెల్లించనున్నారు. అసోం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఆఫ్రికల్ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడిన ఆయా ప్రాంతాల్లోని పందులను చంపివేయనున్నారు. స్వైన్ ప్లూ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 వేలకు పైగా పందులు మృతి చెందాయని, మొత్తం 14 జిల్లాలలో స్వైన్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోందని పశు సంవర్ధక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అసోంలో తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసింది. ‘పశు సంవర్ధక శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి శర్వానంద్ సోనేవాల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయానికి కట్టుబడి, ప్రభావిత జిల్లాల్లో పందుల సంతతిని ముట్టుబెట్టే కార్యక్రమం దుర్గా పూజకు ముందే పూర్తిచేయాలని ఆదేశించారు’అని అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 14 జిల్లాల్లో వైరస్‌కు కేంద్రంగా ఉన్న 30 ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలోని పందులను చంపనున్నట్టు తెలిపారు. తక్షణమే ఈ చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. పందుల యజమానులకు బ్యాంకు ఖాతాల్లో పరిహారం డిపాజిట్ చేయనున్నారు. పందుల యజమానాలకు తొలి విడత పరిహారం కేంద్రం ఇప్పటికే విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 2019 నాటికి అసోంలో మొత్తం 21 లక్షల పందులుండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kDvgT2

No comments:

Post a Comment