Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 1 November 2020

మనసున్న మేజర్.. వినికిడి, మాటలురాని కశ్మీరీ బాలుడి విద్య, వైద్యానికి చేయూత

కశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న సైన్యం.. సాధారణ పౌరుల పట్ల స్నేహభావం చూపుతోంది. కశ్మీరీలకు కష్టమొస్తే మేం ఉన్నామని అక్కున చేర్చుకుంటోంది. వారు ఇబ్బందులను తమ దృష్టికి వస్తే చేతనైన సాయం చేసి ఆదుకుంటోంది. అక్కడ యువతకు క్రీడా మైదానాలు సమకూర్చడం.. విద్య, ఉపాధి శిక్షణ, ఉపాధి కల్పన మార్గాలు చూపించడం వంటివి సైన్యం చేస్తుంటుంది. పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కశ్మీరీలతో మమేకమై వారి పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ అవసరాలు తీరుస్తుంటారు. తాజాగా ఓ యువ మేజర్‌.. మాటలురాని ఓ బాలుడికి విద్య, వైద్యానికయ్యే ఖర్చును భరిస్తానని ముందుకొచ్చాడు. ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్‌‌కు చెందిన మేజర్‌ కమలేష్‌ మణి కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా నాలుగు నెలల కిందట చంజ్‌ముల్లా గ్రామానికి వెళ్లారు. అక్కడ మాట్లడటం, వినడం రాని గౌహుర్‌ మిర్‌ అనే 16ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ బాలుడిని ఆర్మీ క్యాంప్‌కు తీసుకొచ్చిన కమలేష్.. ఒక జత బూట్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ మర్నాడే మిర్‌ ఒక బుట్టడు యాపిల్స్‌ను తీసుకొచ్చి కమలేష్‌కు ఇచ్చాడు. మిర్‌ కుటుంబాన్ని ఒక రోజు కలుసుకున్న కమలేష్‌.. అతడు చదువు, వైద్యానికి అవసరమయ్యే ఖర్చు మొత్తం తాను భరిస్తానని హామీ ఇచ్చారు. మేజర్ మాటలకు భావోద్వేగానికి గురైన ఆ బాలుడి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. అయితే, ఉగ్రవాదుల ముప్పు ఎక్కువగా ఉన్న ఆ గ్రామానికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఈ ఏడాది అక్కడ జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక కల్నల్‌, మేజర్‌, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. తొలుత మిర్‌‌ను బారాముల్లాలోని ఒక పాఠశాలలో చేర్పించినా అక్కడ ఇబ్బందులు ఎదురుకావడంతో హంద్వారాలోని మరో పాఠశాలలో చేర్చారు. ప్రస్తుతం మిర్ తొమ్మిదో తరగుతి చదువుతున్నాడు. ఇక మిర్‌ కోసం మేజర్ ఓ స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చారు. మిర్ కుటుంబంలో నలుగురు దివ్యాంగులే కావడం బాధాకరం. బెంగళూరులోని మిలటరీ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసిన కమలేష్‌ మణి.. పూణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నుంచి శిక్షణ పొందారు. ఆయనకు 2013లో ఇండియన్‌ మిలటరీ అకాడమీలో రాష్ట్రపతి పతకం లభించింది. ఆ పతకం పొందే హక్కు తనను ఇంతటి వాడిని చేసిన పాఠశాలకే ఉంటుందని భావించిన కమలేష్ స్కూల్‌కు అందజేశారు. అత్యంత సమస్యాత్మక గ్రామమైనా ఇప్పటి వరకూ ఎటువంటి బెదిరింపులు రాలేదని, గ్రామస్థులంతా తనకు సహకరిస్తున్నారని మేజర్ వెల్లడించారు. తాను ఓ చిన్న ప్రయత్నం చేశానని, ప్రజల ఆలోచన విధానం మారుతుందని భావిస్తున్నానని అన్నారు. మిర్‌కు 70 శాతం వైకల్యం ఉండటంతో వినగలిగే అవకాశాలు స్వల్పంగా ఉన్నా అతడికి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3oMxr9M

No comments:

Post a Comment