Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 17 July 2021

వివాహితపై అత్యాచారయత్నం..కామాంధుడి పాలిట అపర కాళికలా మారి..

తనపై అత్యాచారానికి ప్రయత్నించిన కామాంధుడిని అడ్డుకుని అతడి పాలిట కాళికలా మారింది. చాకచక్యంగా తప్పించుకుని బండరాయితో మోది తన మానాన్ని కాపాడుకుంది. కామాంధుడ్ని బరబరా ఈడ్చుకొచ్చి రోడ్డుపై పడేసింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సమీపంలో చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మింజూర్‌కు చెందిన వివాహిత (21) చేపల చెరువు వద్ద పని చేసుకుంటుండగా.. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అక్కడ నుంచి నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా.. కామాంధుడితో పెనుగులాడింది. ఈ సమయంలో నిందితుడు పడిపోవడంతో వెంటనే పక్కనే ఉన్న రాయి తీసుకుని తలపై బలంగా కొట్టింది. దీంతో స్పృహ‌కోల్పోయిన నిందితుడ్ని రోడ్డుపై ఈడ్చుకొచ్చి పడేసింది. బాధితురాలు మాట్లాడుతూ.. కొద్ది దూరంలో తన భర్త కూడా చేపల చెరువులో పనులు చేస్తున్నాడని తెలిపింది. ఈ విషయం గురించి తెలిసిన తన భర్త మరి కొందరు కూలీలతో కలిసి అక్కడకు చేరుకున్నాడని పేర్కొంది. అప్పటికే స్థానికులు అక్కడ గుమిగూడారని వివరించింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, ఐపీసీ సెక్షన్ 100 కింద ఆత్మ రక్షణ కోసమే ఆమె ఈ హత్యచేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ధైర్యంతో కామాంధుడి చెర నుంచి తప్పించుకోవడంతో అభినందించారు. మింజూర పోలీస్ అధికారి వడివేల్ మురుగున్ మాట్లాడుతూ.. ‘చుట్టుపక్కలవాళ్లు, స్థానికులను అతడి గురించి విచారణ చేశాం.. అతడు అక్కడ ఉన్న ఏ కంపెనీలోనూ పనిచేయడం లేదని చెప్పారు.. చాలాసార్లు అతడిని చూసినట్టు తెలిపారు’ అన్నారు. నిజానిజాలను నిర్ధారించిన తరువాత మహిళపై ఐపీసీ సెక్షన్ 100 కింద కేసు నమోదు చేసి.. మహిళను వదలిపెట్టినట్టు తిరువల్లూర్ ఎస్పీ వరుణ్ కుమార్ తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hNp7Fe

No comments:

Post a Comment