పంజాబ్లో ఎన్కౌంటర్ జరిగింది. గురుదాస్పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు, బీఎస్ఎఫ్ దళాలకు మధ్య జరిగాయి. ఈ ఘటన అనంతరం 47 కిలోల హెరాయిన్తో పాటు కొన్ని ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. చందువాడ్లా పోస్టు దగ్గర స్మగ్లింగ్ జరుగుతుండగా బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. ఉదయం 5.15 గంటలకు కంచె దగ్గర స్మగ్లర్ కదలికలను గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ తర్వాత రూ.200 కోట్ల విలువ చేసే 47 పసుపు ప్లాస్టిక్ కవర్లో ఉన్న ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. హెరాయిన్తో పాటు రెండు పిస్టల్స్, మందుగుండు సామాగ్రి, నాలుగు ఏకే 47 మేగజైన్లు, ఏడు ఓపీయం ప్యాకెట్లను కూడా బలగాలు సీజ్ చేశాయి. కాగా కర్తార్పూర్ కారిడార్ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా డ్రగ్స్ స్మగ్లింగ్కు బీఎస్ఎఫ్ అడ్డుకట్ట వేస్తూనే ఉంది. జనవరి 20న పంజాబ్లోని అమృత్సర్ జిల్లా సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం నుంచి 8 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ముందు రోజు రాత్రి సెక్టార్లో డ్రోన్ కదలికను గుర్తించిన దళాలు సోదాలు నిర్వహించగా.. సరిహద్దు భద్రతా కంచెకు సమీపంలో డ్రగ్స్ కనిపించాయి. అయితే డ్రోన్ ద్వారా సరఫరా చేస్తోన్న డ్రగ్స్ కిందకు పడిపోయాయని భద్రతా దళాలు గుర్తించాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/34dftYk
0 Comments