కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్లు వాడొద్దు.. ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు

కరోనా బాధితులకు చికిత్సలో స్టెరాయిడ్స్‌ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కోవిడ్ చికిత్సకు సవరించిన మార్గదర్శకాలలో పేర్కొంది. సెకెండ్ వేవ్‌ సమయంలో స్టెరాయిడ్స్‌ను వినియోగించడంపై చీఫ్ ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే తాజాగా మార్గదర్శకాలను ఐసీఎంఆర్ వెలువరించింది. వంటి ఔషధాలు ఎక్కువ మోతాదులో లేదా అవసరానికి మించి ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు ఇన్వాసివ్ మ్యూకోర్మైకోసిస్ లేదా 'బ్లాక్ ఫంగస్' వంటి సెకండరీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని త్వరగా పెంచుతాయని మార్గదర్శకాలలో పేర్కొంది. ‘తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన’ మూడు రకాల ఇన్ఫెక్షన్‌ల కోసం అవసరమైన ఔషధాల మోతాదులను వివరించింది. దగ్గు రెండు-మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే రోగులకు టీబీ, ఇతర పరీక్షలను నిర్వహించాలని సూచించింది. నీతి-ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ గతవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టెరాయిడ్స్ వంటి ఔషధాలు అతిగా వినియోగం, దుర్వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా హైపోక్సియా లేని తేలికపాటి లక్షణాలున్న రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవచ్చు. వీరికి అధిక జ్వరం లేదా ఐదు రోజుల కంటే ఎక్కువ తీవ్రమైన దగ్గు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే, ఆక్సిజన్ శాచ్యురేషన్ 90-93 శాతం మధ్య ఉండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆస్పత్రిలో చేరాలి. వైరస్ తీవ్రత మధ్యస్థంగా ఉన్న కేసులుగా పరిగణించి, రోగులకు ఆక్సిజన్ అందజేయాలి. శ్వాస రేటు నిమిషానికి 30 కంటే ఎక్కువ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాచ్యురేషన్ 90 శాతం కంటే తక్కువగా ఉంటే తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలి. అలాంటి రోగులకు వెంటిలేషన్ అవసరం కాబట్టి వారిని ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. వీరికి అవసరమైతే నిరంతం ఆక్సిజన్‌ను అందజేయాలి. అలాగే, కొవిడ్‌ లక్షణాలు కనిపించిన పది రోజుల్లోపు ఆక్సిజన్‌ అవసరమైన రోగుల చికిత్స కోసం రెమ్‌డెస్‌విర్‌ ఔషధాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది. ఆక్సిజన్‌ అవసరం లేనివారికి, ఇళ్లలోనే ఉండి కోలుకుంటున్న వారికి దీన్ని వాడకూడదని స్పష్టం చేసింది. కేవలం ఆసుపత్రుల్లో, అందునా ఆక్సిజన్‌ అందిస్తున్నవారికి మాత్రమే 5 రోజులపాటు దీన్ని ఉపయోగించాలని పేర్కొంది. తొలిరోజు 200 ఎంజీ, ఆ తర్వాత నాలుగు రోజులు 100 ఎంజీ చొప్పున వాడాలని విస్పష్టంగా సూచించింది. స్టెరాయిడ్లకు తగిన స్పందన లేనివారికి టొసిలిజుమాబ్‌ను ఇవ్వొచ్చని పేర్కొంది. లక్షణాలు తీవ్రమైన 24-48 గంటల్లోపుగానీ, ఐసీయూలో చేరిన వెంటనేగానీ దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది. స్టెరాయిడ్స్‌తో కలిపి టొసిలిజుమాబ్‌ ఇవ్వడం మంచిదని పేర్కొంది. అయితే ఇది ఇచ్చినవారికి టీబీ, ఫంగల్‌, సిస్టమిక్‌ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండకూడదని తెలిపింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/33xpijI

Post a Comment

0 Comments