కరోనా టెర్రర్… పార్లమెంట్ సిబ్బందికి పాజిటివ్

దేశంలో భారీగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు, నాయకులు కరోనా బారిన పడుతున్నారు.తాజాగా సిబ్బందికి కూడా కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సిబ్బందిలో 400 మందికిపైగా కోవిడ్ బారిన పడ్డారు. పార్లమెంట్‌లో పనిచేస్తోన్న 1409 మందిలో 402 మందికి కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది. వీరికి సోకింది ఏ వేరియంటో తెలుసుకోవడానికి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. కాగా ఇందులో చాలామందికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వ జారీ చేసిన ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సిబ్బందికి సందేశాలు జారీ అయ్యాయి. 200 మంది లోక్‌సభ సిబ్బందికి, 69 మంది రాజ్యసభ సిబ్బందికి, 133 మంది అనుబంధ సిబ్బందికి కోవిడ్ సోకినట్లు ఈ సందేశంలో తెలియజేశారు. వైరస్ సోకినవారితో పనిచేసిన ఇతర సిబ్బందిని ఐసొలేషన్‌లో ఉంచారు. ఇక ముంబైలోని సీబీఐ ఆఫీసులో 68 మంది కోవిడ్ బారిన పడ్డారు. అక్కడ పనిచేస్తోన్న 235 మంది టెస్ట్‌లు చేసుకోగా 68 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ సోకినవారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గంటల వ్యవధిలోనే అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోని వారికి బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి వీలు లేని నిబంధనలు పెడుతున్నాయి. వీకెండ్స్‌లో పూర్తి కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3zFlZCS

Post a Comment

0 Comments