లక్ష్యాన్ని ఛేదించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. భారత నౌకాదళ విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నుంచి పశ్చిమ తీరంలో ఈ మిస్సైల్‌ను పరీక్షించింది. ఈ మిస్సైల్ సముద్రతల పోరాటానికి సంబంధించినది. క్షిపణి సముద్రం నుంచి సముద్రం వేరియంట్‌ను గరిష్ట రేంజ్‌లో పరీక్షించగా టార్గెట్ షిప్‌ను ఢీకొట్టింది. ఈ విషయాన్ని భారత నౌకదళ వర్గాలు ట్వీట్ ద్వారా తెలియజేశాయి. అయితే చైనా, పాక్‌లతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో భారత్ ఈ పరీక్ష చేయడం గమనార్హం. రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి డీఆర్‌డీవో వరసగా ప్రయోగాలు చేస్తోంది. పదునైనా అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. గత నెలలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ వేరియంట్‌ను ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అదే నెలలో షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌‌ని కూడా విజయవంతంగా పరీక్షించారు. అలాగే అంతకుముందు చేసిన అగ్ని ప్రైమ్ క్షిపణి, అభ్యాస్‌ క్షిపణిల ప్రయోగాలు అయ్యాయి. ఇదిఇలా ఉండగా యూపీలోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. త్వరలో ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. అక్కడ బ్రహ్మోస్ క్షిపణి, ఇతర రక్షణ పరికరాలు, ఆయుధాలు తయారు చేయనున్నారు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను తయారు చేయడానికి భారతదేశం ఎదురు చూస్తోందని, తద్వారా ఏ శత్రు దేశం దానిపై కన్ను వేయదని గతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఏదిఏమైనా శక్తివంతమైన క్షిపణులను భారత రక్షణ రంగం కైవసం చేసుకుంటుంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3GxkOYZ

Post a Comment

0 Comments