Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 30 July 2019

ముద్దు పెట్టి మూల్యం చెల్లించుకున్నాడు.. ఎస్సైని కిస్ చేసిన వ్యక్తి కటకటాల్లోకి

బోనాల పండుగ ఊరేగింపులో మందేసి, చిందేస్తూ మత్తులో ఎస్సైకి ముద్దు పెట్టి, విధులకు ఆటంకం కలిగించిన యువకుడు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై పోలీసులు సోమవారం (జులై 29) కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా నల్లకుంట పరిధిలోని విద్యానగర్ టీఆర్టీ కాలనీలో స్థానిక యువకులు ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. అందులో మల్కాజ్‌గిరికి చెందిన ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి పి భాను కూడా పాల్గొన్నాడు. వేడుకల్లో భాగంగా భద్రత కోసం నల్లకుంట ఎస్సై కె మహేందర్ కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించారు. అయితే.. ఊరేగింపులో మద్యం సేవించిన భాను.. అటుగా వెళ్తున్న ఎస్సైని ఆపి, ఆకస్మాత్తుగా ముద్దు పెట్టాడు. ఆ పరిణామానికి షాకైన ఎస్సై భానును వెనక్కి తోసేసి, చెంప చెళ్లుమనిపించారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ తతంగమంతా మొబైల్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. Read Also: ఉన్నతాధికారుల సూచనతో ఎస్సై మహేందర్.. భానుపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భానుని అదుపులోకి తీసుకొని అతడిపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీధర్ తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K3Y4F9

No comments:

Post a Comment