Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 7 August 2019

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పోటెత్తిన కస్టమర్లతో గుట్టురట్టు

వ్యభిచార నిర్వాహకులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త పుంతలు తొక్కుతూ తమ దందాను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నోచోట్ల ఫ్యామిలీ అపార్ట్‌మెంట్లలోనే గుట్టుగా నిర్వహిస్తున్నారు. కొందరైతే మసాజ్, స్పా సెంటర్ల ముసుగులో యథేచ్ఛగా దందా కొనసాగిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. తాజాగా నెల్లూరులో బయటపడిన సెక్స్ రాకెట్ పోలీసులకే సవాల్‌గా మారింది. జిల్లా వెంకటగిరికి చెందిన ధనుంజయ్‌రెడ్డి అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరు నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. మాగుంట లేఅవుట్‌ సమీపంలోనే నివాసముంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో తృప్తి చెందని ధనుంజయ్‌రెడ్డి వ్యభిచార దందాకు తెరలేపాడు. మాగుంట లేఅవుట్ సెంటర్లోనే ఓ షాపును అద్దెకు తీసుకుని మసాజ్ సెంటర్ ప్రారంభించాడు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. మసాజ్ కోసం వచ్చే కస్టమర్లను ఊరించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ విషయం నగరంలో విస్తృత ప్రచారం జరగడంతో భారీ సంఖ్యలో కస్టమర్లు మసాజ్ సెంటర్‌కు పోటెత్తారు. రోజురోజుకీ తాకిడి పెరిగిపోతుండటంతో వచ్చిన వారిని కట్టడి చేయలేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి మసాజ్ సెంటర్‌పై నిఘా పెట్టాలని నగర పోలీసులను ఆదేశించారు. దీంతో సివిల్ డ్రెస్‌లో ఆ సెంటర్‌కు వెళ్లిన పోలీసులు అక్కడ జరిగే దందా అంతా గమనించారు. సోమవారం డీఎస్పీ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో పోలీసులు మసాజ్ సెంటర్‌పై దాడిచేశారు. నిర్వాహకుడు ధనుంజయ్‌రెడ్డితో పాటు ఇద్దరు విటులు, ఇద్దరు సెక్స్ వర్కర్లును అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ వర్కర్లను ప్రభుత్వ హోమ్‌కు తరలించి.. మిగిలిన ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. నిర్వాహకులు ధనుంజయ ఫోన్లో వందలాది మంది అమ్మాయిలు, కస్టమర్ల ఫోన్ నంబర్లు ఉండటాన్ని చూసి పోలీసులు షాకయ్యారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YsbRxO

No comments:

Post a Comment