Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 16 August 2019

ఇల్లు అద్దెకు తీసుకుని యజమానురాలి కుమార్తెపైనే అత్యాచారం

అద్దెకు ఇంటి యజమానురాలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. తల్లి ఇంట్లోలేని సమయంలో మతిస్థిమితం లేని యువతి(30)ని బెదిరించిన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. రహమత్‌నగర్‌లో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సొంతింటిలో నివసిస్తోంది. ఆమె కుమార్తెకు మతిస్థిమితం సరిగ్గా ఉండకపోవడంతో కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. వీరింట్లోకి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) మూడు నెలల అద్దెకు దిగాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నప్పటికీ విబేధాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఓ పరిశ్రమంలో కార్మికుడిగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమానురాలి కుమార్తెపై అతడి కన్ను పడింది. రాఖీ పౌర్ణమి రోజున ఇంటి యజమానురాలు తన సోదరుడికి రాఖీ కట్టేందుకు కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన వీరాస్వామి ఇంట్లోకి వెళ్లి మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన తల్లి కుమార్తె ఏదో ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె స్థానికులతో కలిసి వీరాస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరాస్వామి కోసం గాలింపు చేపట్టి 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ 376(2)(1), 448 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2z2E675

No comments:

Post a Comment