
ఏడేళ్లు సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో నివాసముండే రాహుల్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తికి 2011లో బెంగళూరుకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. తాను అనాథనని, హైదరాబాద్లో వ్యాపారం చేస్తానని రాముల్ చెప్పడంతో ఆ మహిళ అతడికి దగ్గరైంది. Also read: 2012 నుంచి 2019 జనవరి వరకు ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే రాహుల్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించిన ఆ మహిళ అతడి గురించి ఆరా తీయగా షాకింగ్ విషయాలు తెలిశాయి. అతడికి చాలామంది మహిళలతో లైంగిక సంబంధం ఉందని తెలియడంతో ఆ మహిళ దూరం పెట్టి వెళ్లిపోయింది. ఈ నెల ఐదో తేదీన రాహుల్ ఆ మహిళకు ఫోన్ చేసి కారు తెప్పించుకున్నాడు. ఐదు రోజుల తర్వాత తన కారు ఇవ్వాలని ఆమె ఫోన్ చేసి కోరగా బెదిరింపులకు దిగాడు. Also read: దీంతో ఆమె చేరుకుని రాహుల్ని కలిసి నిలదీసింది. కారు తిరిగివ్వనని, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ దురుసుగా సమాధానం చెప్పి కారుతో ఉడాయించాడు. దీనికి తోడు రాహుల్ ప్రస్తుతం మరో యువతితో డేటింగ్లో ఉన్నాడని తెలుసుకున్న ఆ మహిళ బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాహుల్ ఫెర్నాండెజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Pesqrr
No comments:
Post a Comment