Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 25 October 2019

ఒకరితో ఏడేళ్లు సహజీవనం చేసి.. మరో యువతితో ప్రేమాయణం

ఏడేళ్లు సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో నివాసముండే రాహుల్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తికి 2011లో బెంగళూరుకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. తాను అనాథనని, హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తానని రాముల్ చెప్పడంతో ఆ మహిళ అతడికి దగ్గరైంది. Also read: 2012 నుంచి 2019 జనవరి వరకు ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే రాహుల్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించిన ఆ మహిళ అతడి గురించి ఆరా తీయగా షాకింగ్ విషయాలు తెలిశాయి. అతడికి చాలామంది మహిళలతో లైంగిక సంబంధం ఉందని తెలియడంతో ఆ మహిళ దూరం పెట్టి వెళ్లిపోయింది. ఈ నెల ఐదో తేదీన రాహుల్ ఆ మహిళకు ఫోన్ చేసి కారు తెప్పించుకున్నాడు. ఐదు రోజుల తర్వాత తన కారు ఇవ్వాలని ఆమె ఫోన్ చేసి కోరగా బెదిరింపులకు దిగాడు. Also read: దీంతో ఆమె చేరుకుని రాహుల్‌ని కలిసి నిలదీసింది. కారు తిరిగివ్వనని, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ దురుసుగా సమాధానం చెప్పి కారుతో ఉడాయించాడు. దీనికి తోడు రాహుల్ ప్రస్తుతం మరో యువతితో డేటింగ్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆ మహిళ బుధవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాహుల్ ఫెర్నాండెజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Pesqrr

No comments:

Post a Comment