Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 25 October 2019

పండగ సామాన్లకు వెళ్తూ ప్రమాదం.. ఆరు కుటుంబాల్లో విషాదం

తమిళనాడులో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మదురై జిల్లాలో ప్రయాణీకులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. దీపావళి పండుగకు సామాన్లు కొనడానికి ఆటోలో వెళ్తున్న అభాగ్యులను మృత్యుదేవత వెంబడించింది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆరు కుటుంబాల్లో విషాదం నింపింది. కోడంగినాయక్కన్‌ పట్టి నుంచి 13 మంది ఒక ఆటోలో దీపావళికి సరకులు కొనడానికి ఉసిలంబట్టికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తోన్న ఆటో ఎరంబట్టి సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో ముందుభాగం ధ్వంసమై ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతులను జోతి నయకనూర్‌కు చెందిన వసీఅమ్మాల్ (45), ముత్తులక్ష్మీ (45), కొండంగినాయకనపట్టికి చెందిన సత్య (28), ఉసిలంబట్టికి చెందిన గురువమ్మల్ (50), అండిపట్టికి చెందిన మురుగన్ (45), ఆటో డ్రైవర్ అశోక్ (40)‌గా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. గాయపడినవారికి మదురై రాజాజీ హాస్పిటల్, ఉసిలంపట్టి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ఉసిలంపట్టి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు. మృతదేహాలను ఉసిలంపట్టి హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. శనివారం పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2WhfLFn

No comments:

Post a Comment