
ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. దుమెర్పానిలోని పైకమల్ గురుకుల పాఠశాల సమీపంలో ఓ ఇంట్లో నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు శనివారం రాత్రి రైడ్ చేశారు. ఈ ఘటనలో మైనర్ బాలికతో సహా ఇద్దరు మహిళలను రక్షించారు. సెక్స్ రాకెట్ నిర్వాహకురాలు శాంతిలతతో ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. Also Read: శాంతిలత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బాలికలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచాయం చేయిస్తోందని పోలీసులు తెలిపారు. తన మాట వినకపోతే వారిని చిత్రహింసలు పెట్టేదని వెల్లడించారు. ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బాలికలను అక్రమ రవాణా చేసి వ్యభిచార రొంపిలోకి దించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. Also Read: ఈ వ్యభిచార కేంద్రం నుంచి తప్పించుకున్న ఓ మహిళ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సెక్స్ వర్కర్లను ఉజ్వల్ హోమ్కు తరలించిన పోలీసులు నిందితులను బార్ఘడ్ కోర్టులో హాజరుపరిచారు. బాలికలను వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2rCLUfB
No comments:
Post a Comment