
శివారులో దంపతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మూడురోజులుగా కనిపించకుండా పోయిన భార్యభర్తలు సెల్ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలివెళ్లిపోయారు. దీంతో వారు ఎక్కడికి వెళ్లారన్నది ఉత్కంఠగా మారింది. Also Read: మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని పద్మానగర్ ఫేజ్-2 నివాసముండే అవినాశ్, ప్రణతి దంపతులు గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్న కంపెనీలో ఇటీవల ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. దీంతో యాజమాన్యం వీరికి తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీ నుంచి వారిద్దరు కనిపించకుండా పోయారు. ఆ రోజు రాత్రయినా కూడా దంపతులు రాకపోవడంతో ఇంటి యజమాని ఖమ్మంలో ఉండే అవినాశ్ తల్లి రజినికి ఫోన్ చేసి చెప్పారు. Also Read: దీంతో ఆమె కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని హైాదరాబాద్ చేరుకుని బంధువుల ఇళ్లల్లో ఆరా తీశారు. వారి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పదో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంట్లో తనిఖీ చేయగా అవినాశ్, ప్రణతి సెల్ఫోన్లు, పర్సులు, క్రెడిట్, డెబిట్ కార్టులు అన్నీ గదిలోనే ఉన్నాయి. దీంతో ప్లాన్ ప్రకారమే వారిద్దరూ బయటకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, సంస్థ ప్రతినిధులను విచారిస్తున్నారు. భార్యభర్తల వద్ద సెల్ఫోన్ లేకపోవడంతో వారుఎక్కడున్నారో ట్రాక్ చేయడం కుదరడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మూడురోజులుగా వారి జాడ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2X8f16g
No comments:
Post a Comment