Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 26 February 2020

ఎయిర్‌ఫోర్స్ విమానంలో 112 మంది చైనా నుంచి ఢిల్లీకి.. వీరిలో ఇద్దరు తెలుగు వాళ్లు!

కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న చైనా నగరం వుహాన్ నుంచి 112 మందిని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక విమానంలో గురువారం న్యూఢిల్లీ తీసుకొచ్చారు. వీరిలో 76 మంది భారతీయులు కాగా.. 36 మంది విదేశీయులు ఉన్నారు. సీ17 విమానంలో భారత్ నుంచి 15 టన్నుల బరువైన మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని చైనా తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు చైనాలో చిక్కుకున్న వారిని తీసుకొచ్చారు. వీరిలో కర్నూలుకు చెందిన జ్యోతి, శ్రీకాకుళం‌కి చెందిన సాయి కూడా ఉన్నారని సమాచారం. వీరందర్నీ చావ్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు. వుహాన్ నుంచి తీసుకొచ్చిన 36 మంది విదేశీయుల్లో బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, చైనా, దక్షిణాఫ్రికా, అమెరికా, మడగాస్కర్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. గతంలో ఎయిరిండియా విమానంలో 600 మంది భారతీయులు, బంగ్లాదేశీయులు, మాల్దీవుల పౌరులను భారత్ తీసుకొచ్చారు. చైనాలో చిక్కుకున్న మిగతా భారతీయులను తిరిగి పంపడంలో చైనా తాత్సారం చేసింది. కానీ భారత అధికారులు అనేక దఫాలుగా చర్చలు జరిపి వారిని వెనక్కి పంపడానికి చైనా ప్రభుత్వాన్ని ఒప్పించారు. జపాన్‌లోని యొకొహమా వద్ద డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న 119 మంది భారతీయులను, ఐదుగురు విదేశీయులను ఎయిరిండియా విమానంలో టోక్యో నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. ఈ షిప్‌లో చాలా మందికి సోకగా.. తీరం వద్ద నిలిపి చికిత్స అందిస్తున్నారు. ఎయిరిండియా విమానంలో ఢిల్లీ తీసుకొచ్చిన ఐదుగురు విదేశీయుల్లో ఇద్దరు శ్రీలంక పౌరులు కాగా.. నేపాల్, సౌతాఫ్రికా, పెరూ దేశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిని కూడా మనేసర్‌లోని క్వారంటైన్ సెంటర్లో 14 రోజలపాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నారు. కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2770కి చేరగా.. ప్రస్తుతం 81,212 మందికి ఈ వ్యాధి సోకింది. చైనాతోపాటు, ఇరాన్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా సహా 48 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2wcMx1q

No comments:

Post a Comment