Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 25 February 2020

ఇరాన్‌లో కరోనా విజృంభణ.. ఆరోగ్య మంత్రికీ కోవిడ్, భయం గుప్పిట పశ్చిమాసియా

చైనాను వణికిస్తోన్న ఇప్పుడు ఇరాన్‌, పశ్చిమాసియా దేశాలను కూడా బెంబెలెత్తిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇరాన్‌లో 95 కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌కు సైతం కరోనా వైరస్ సోకిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘నాకు కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. కానీ వైరస్‌ను తప్పకుండా ఓడిస్తాననే నమ్మకం ఉంది’ అని ఫార్స్ న్యూస్ ఏజెన్సీతో ఇరాజ్ హరిర్చి తెలిపారు. వాస్తవానికి ఇరాన్‌లో కరోనా బారిన పడి ఎక్కువ మందే చనిపోయారని, కానీ అధికారికంగా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇరాన్ మీదుగా కరోనా వైరస్ ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, అప్ఘానిస్థాన్ తదితర దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తోంది. యూఏఈ, కెనడా, లెబనాన్ లాంటి దేశాలు కూడా కోవిడ్ కేసులు ఇరాన్ నుంచే వచ్చాయని ఆరోపిస్తున్నాయి. కోమ్ నగరానికి వస్తున్న యాత్రికుల కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న ఇరాన్ కరోనా ముప్పును ఎదుర్కోవడం కష్టమనే భావన వ్యక్తం అవుతోంది. అక్కడ రెండు వేల మందికి మూడు హాస్పిటల్ బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కరోనా భయం కారణంగా ఇరాన్ పొరుగు దేశాలైన టర్కీ, ఆర్మేనియా, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ సరిహద్దులను మూసేశాయి. బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, సౌదీ, యూఏఈలు ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపేశాయి. కాగా చైనాతో గట్టి వాణిజ్య సంబంధాలున్న ఇరాన్.. ఆ దేశం నుంచి రాకపోకలను మాత్రం నిలిపేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 80 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2700 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. కాగా ఈ ప్రమాదకర వైరస్ ఇటలీ మీదుగా యూరప్ దేశాలకూ వ్యాపిస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HYkYM1

No comments:

Post a Comment