దేశ రాజధాని దిల్లీలో అత్యంత దారుణమైన ఘటన త్రుటిలో తప్పింది. ఇంటి పక్కనే ఉండే ఓ మూడేళ్ల చిన్నారిపై కన్నేసిన వృద్ధుడు ముక్కుపచ్చలారని బాలికను అత్యాచారం చేయబోయాడు. చుట్టుపక్కల వారు దీన్ని గుర్తించి అప్రమత్తం కావడంతో మూడేళ్ల బాలికపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించిన ఓ అరవై ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈశాన్య దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. Also Read: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముస్తఫాబాద్ ప్రాంతంలోని నివాసం ఉండే దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ ఇంటి పక్కనే అఘాయిత్యానికి యత్నించిన వృద్ధుడు కూడా నివాసం ఉంటున్నాడు. మొదటి నుంచి వృద్ధుడికీ, బాలిక తల్లిదండ్రులకు పరిచయం ఉంది. చిన్నారిపై కన్నేసిన కామాంధుడు తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను గురువారం తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్నారి బట్టలు విప్పేశాడు. చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లడం గమనించిన ఓ వ్యక్తి అనుమానంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే వారు అప్రమత్తమై వృద్ధుడి బారి నుంచి బాలికను కాపాడినట్లుగా పోలీసులు వెల్లడించారు. Must Read: ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వృద్ధుడిని అరెస్టు చేశారు. అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలు సురక్షితంగానే ఉన్నట్లుగా వైద్యులు నిర్ధరించారు. Also Read: Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vDSLrv
0 Comments