పెళ్లి ఖర్చుల కోసం కండక్టర్ డబ్బుల బ్యాగు కొట్టేసి.. చివరికి..

చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ యువకుడు చివరికి చేసేది లేక దొంగగా మారాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని గౌలిపురలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన శంకర్‌ కుమారుడు 22 ఏళ్ల గువ్వల సుమన్‌. ఇతను ఓల్డ్ మలక్‌పేటలోని ఓ వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. అంతేకాక, ఇతనికి ఓ ప్రియురాలు కూడా ఉంది. చాలా కాలం నుంచి ప్రేమలో ఉండడంతో ఇద్దరూ కలిసి ఇటీవలే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, సుమన్ వద్ద పెళ్లి ఖర్చులకు డబ్బు లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న సుమన్ చేసేది లేక దొంగతనాన్ని ఎంచుకున్నాడు. చోరీ చేయగా వచ్చిన సొమ్ముతో ప్రేమించిన అమ్మాయిని వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. మార్చి 14న చోరీకి ప్లాన్ చేశాడు. మరోవైపు, అదేరోజు యాకుత్‌పురలోని ఉప్పర్‌బస్తీ ప్రాంతానికి చెందిన ఓ మహిళా కండక్టర్ డ్యూటీకి వెళ్లేందుకు యాకుత్‌పుర నుంచి ఫలక్‌నుమా వెళ్లేందుకు ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కింది. యాకుత్‌పుర రైల్వేస్టేషన్‌లో రైలు కదులుతుండగా గువ్వల సుమన్‌ రైలు ఎక్కి భార్గవి బ్యాగును కాజేశాడు. Must Read: వెంటనే రైలు దిగి పారిపోయాడు. ఆ బ్యాగులో రూ.25 వేల నగదు, ఆర్టీసీ ఐడీ కార్డు, సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డు ఉన్నాయని బాధితురాలు వెల్లడించింది. ఈ డబ్బుతోనే ప్రే మించిన అమ్మాయిని అలియాబాద్‌లోని అర్యసమాజ్‌లో అనుకున్న ముహూర్తానికి ఈ నెల 16న పెళ్లి చేసుకున్నాడు. ఇటు బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారంలో రైల్వే పీసీ సుబ్బారావు తనిఖీలు చేస్తుండగా సుమన్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతను చేసిన చోరీని ఒప్పుకున్నాడు. సుమన్‌ నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకొని శుక్రవారం అరెస్టు చేశారు. Must Read: Must Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QyZ9Y5

Post a Comment

0 Comments