అనాథగా పెరిగి.. తనకంటూ కుటుంబం ఏర్పడిన కొద్దిరోజులకే.! శామీర్‌పేట ప్రీతి విషాదాంతం

శామీర్‌పేట్ తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. కుటుంబ కలహాలకు ఇద్దరు బిడ్డలు సహా ముగ్గురు బలయ్యారు. తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి.. తల్లి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటనలో చిన్నారులు అదేరోజు ప్రాణాలు విడిచారు. జిల్లా శామీర్‌పేట్ మండలం మజీత్ పూర్ ప్రజా హోమ్స్‌లో చికిత్స పొందుతున్న తల్లి ప్రీతి రాత్రి ప్రాణాలు విడిచింది. ప్రీతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో వరంగల్ లోని ఒక అనాథాశ్రమంలో పెరిగింది. తాను పెరిగి పెద్దైన తర్వాత గోపీనాథ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్ళైన కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. నిత్యం గొడవలు జరుగుతుండడంతో ఆమె తరచూ తాను పెరిగిన అనాథాశ్రమానికి వెళ్లి కొద్దిరోజులు ఉండి వచ్చేది. Also Read: నిత్యం గొడవలు జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన ప్రీతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన బిడ్డలు అనాథలవుతారని భావించి ఇద్దరు పిల్లలు గౌరవ్(4), కౌశిక్(3)తో పురుగుల మందు తాగించి తాను తాగేసింది. గమనించిన కుటుంబససభ్యులు, స్థానికులు తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారులు అదే రోజు మరణించగా తల్లి ప్రీతి నిన్న రాత్రి ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Xm8ANk

Post a Comment

0 Comments