
బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. అయితే, మహాకూటమి సీఎం అభ్యర్థి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జీడీ) నేత మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించి కొత్త రికార్డులు నెలకొల్పారు. కేవలం ఒక్క రోజులోనే 19 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించి భారత రాజకీయాల్లో ఓ కొత్త రికార్డ్ సృష్టించారు. అంతేకాదు, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును తనయుడు అధిగమించడం విశేషం. లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్క రోజు 16 చోట్ల ప్రచార సభల్లో పాల్గొన్నారు. గతంలో ఏ రాజకీయ నేత ఒక్క రోజు ఇన్నిచోట్ల ప్రచారం నిర్వహించలేదు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టిన తేజస్వీ.. ఒక్క రోజులో ఏకంగా 17 ర్యాలీలు, 2 రోడ్డు షోలు నిర్వహించారు. వేర్వేరు జిల్లాల్లోని ప్రచార సభల్లో తేజస్వీ పాల్గొనడం విశేషం. తేజస్వీ యాదవ్ శనివారం ఉదయం 10.05 గంటలకు సీతామర్హి నుంచి ర్యాలీ ప్రారంభించి, వైశాలి జిల్లాల్లోని బిదూపూర్ బ్లాక్లో సాయంత్రం 4.45 గంటలకు చివరి ర్యాలీ నిర్వహించారు. ఈ మధ్యలో మొత్తం 17 ర్యాలీలు, 2 రోడ్డు షోలు నిర్వహించారు. ప్రజలు తన పట్ల చూపుతున్న ఆదరణ, ప్రేమతో సుడిగాలి పర్యటన సాగిస్తున్నా తనకు శారీరకంగా, మానసికంగా ఎటువంటి అలసట లేదని తేజస్వీ చెప్పుకొచ్చారు. యువతలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ప్రజా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉత్తేజపూరిత ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తూన్న తేజస్వీ.. అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి, సీఎం రోజుకు 6 నుంచి ఏడు ర్యాలీల్లో పాల్గొంటుండగా.. ప్రధాని మోదీ మొత్తం 12 చోట్ల ప్రచారం చేస్తున్నారు. తేజస్వీ మాత్రం ఏకంగా ఒకే రోజు 19 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఔరా అనిపించారు. ఒకే రోజు ఇన్ని చోట్ల ప్రచారం నిర్వహించడం సాధారణ విషయం కాదు. ఇక, తేజస్వీ పట్టుదలపై శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశంసలు కురిపిస్తూ ఆ కుర్రాడు రేపు సీఎం అయినా ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యానించారు. తేజస్వీ సభలకు జనాలు వెల్లువలా వస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37YeEm5
No comments:
Post a Comment