Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 2 November 2020

కాబూల్ యూనివర్సిటీలో దుండగుడి మారణహోమం.. 20 మంది విద్యార్థుల మృతి, 21 మందికి గాయాలు

ఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో సాయుధులైన దుండగులు రక్తపాతం సృష్టించారు. యూనివర్సిటీలో చొరబడి విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు సాగిన ఈ మారణహోమంలో 20 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు చేసిన బీభత్సం తర్వాత ఎటు చూసినా విషాదమే. కాబుల్ యూనివర్సిటీ గోడలపై రక్తపు మరకలు, చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, వాటిపై మృతదేహాలతో ఘటనా స్థలి భీతావహంగా మారింది. విద్యార్థుల ఆర్తనాదాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. ప్రాణ భయంతో కొంత మంది విద్యార్థులు పారిపోతున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. యూనివర్సిటీ గోడలను దూకేసి విద్యార్థులు పారిపోయారు. అమాయకులైన విద్యార్థులు బలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం (నవంబర్ 2) సాయంత్రం కాబూల్ యూనివర్సిటీలో జరుగుతున్న బుక్ ఫెయిర్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ కార్యక్రమంలో అఫ్గానిస్థాన్‌లో ఇరాన్ రాయబారి పాల్గొంటున్నట్లు తెలియడంతో లక్ష్యంగా చేసుకున్నారు. నిమిషాల వ్యవధిలో రక్తపాతం సృష్టించారు. ఘటనలో మొత్తం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు తామే కారణమంటూ తాలిబన్లు ఓ లేఖ విడుదల చేశారు. కిటికీలలో అలాగే ఒరిగిపోయిన విద్యార్థులు.. కిటికీలలో నుంచి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులను కూడా కర్కశకులు వదల్లేదు. కాల్పులు జరపడంతో వాళ్లు అలాగే ఒరిగిపోయారు. ఆ విషాద దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. భూమిపై నూకలు రాసిపెట్టి ఉన్న కొంత మంది మాత్రం దూకి తప్పించుకున్నారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. పడమటి వైపున సూర్యుడు మెల్లగా అదృశ్యం అవుతుండగా.. విద్యార్థులు కాసేపట్లో ఇంటికి బయల్దేరుతారనగా ఈ పాశవిక దాడి జరిగింది. చీకటి పడటంతో సరైన వివరాలు అందడంలేదు. రెస్క్యూ ఆపరేషన్‌కు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమాయకులైన విద్యార్థులను బలి తీసుకోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల మారణహోమం నిత్యకృత్యమైంది. అటు చర్చలు కొనసాగుతుండగానే ఇటు రక్తపాతం జరుగుతోంది. సుదీర్ఘంగా సాగుతున్న అంతర్యుద్ధం నుంచి అమెరికా ఇటీవలే తన బలగాలను ఉపసంహరించుకుంది. అఫ్గాన్ ప్రభుత్వంతో తాలిబన్లు.. గల్ఫ్ అరబ్ దేశం కతార్ వేదికగా కొన్ని రోజులుగా ఈ చర్చలు జరుపుతున్నారు. అయినా.. రక్తపాతాన్ని ఆపడానికి మాత్రం అవి పనిచేయడంలేదు. Also Read: Must Read: Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JqqcUR

No comments:

Post a Comment