Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 2 November 2020

స్కూటీలపై హీరో ఎలక్ట్రిక్ బంపరాఫర్.. దీపావళి స్పెషల్, రెండు బొనాంజాలు

లక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ‘హీరో ఎలక్ట్రిక్‌ () దీపావళి పండగ వేళ బంపరాఫర్ ప్రకటించింది. స్కూటీల కొనుగోళ్లపై కస్టమర్లకు రూ.6000 వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది. కొత్త స్కూటీల కొనుగోలుపైనే కాకుండా పాత వాహనాల ఎక్స్ఛేంజ్‌పైనా ఆఫర్ ప్రకటించింది. ఈ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.5 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం (నవంబర్ 2) ఓ ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో వడ్డీ లేని రాయితీ (0% Interest) సదుపాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. మూడు రోజుల రిటర్న్‌ పాలసీ సదుపాయంలో భాగంగా కొన్ని మోడళ్ల వాహనాలపై మరో రూ.2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. పరిమిత కాలపు ఈ ఆఫర్లు నవంబర్ 14 వరకే వర్తిస్తాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 500 డీలర్ల నుంచి ఈ ఆఫర్లను పొందవచ్చని హీరో ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొంది. లీడ్‌యాసిడ్‌ స్కూటర్ల మోడల్స్‌పై రూ.3,000 డిస్కౌంట్‌ అందిస్తుండగా.. ఇతర ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5000 వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. లిథియం ఐయాన్‌తో పాటు లీడ్‌ యాసిడ్‌ ఇ-స్కూటర్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. అయితే.. ఇటీవల విడుదల చేసిన ఆప్టిమా హెచ్‌ఎక్స్‌ సిటీ స్పీడ్‌ (Optima HX City Speed), ఎన్‌వైఎక్స్‌ హెచ్‌ఎక్స్‌ సిటీ (Nyx HX City) స్కూటీలకు ఈ ఆఫర్లు వర్తించవని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఈ వాహనాల ధరలు వరసగా రూ.57,560, రూ.63,990గా ఉన్నాయి. దీపావళి పండగ సీజన్‌ను పురస్కరించుకొని ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో సోహిందర్‌ గిల్‌ తెలిపారు. ఈ పండగ సీజన్‌లో తక్కువ ధరకే ఇ-స్కూటర్లను సొంతం చేసుకోవచ్చునని ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్లతో ఎలక్ట్రిక్ స్కూటీల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని Hero Electric సంస్థ భావిస్తోంది. Also Read: Must Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mHES0c

No comments:

Post a Comment