
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ‘హీరో ఎలక్ట్రిక్ () దీపావళి పండగ వేళ బంపరాఫర్ ప్రకటించింది. స్కూటీల కొనుగోళ్లపై కస్టమర్లకు రూ.6000 వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది. కొత్త స్కూటీల కొనుగోలుపైనే కాకుండా పాత వాహనాల ఎక్స్ఛేంజ్పైనా ఆఫర్ ప్రకటించింది. ఈ ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ.5 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం (నవంబర్ 2) ఓ ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో వడ్డీ లేని రాయితీ (0% Interest) సదుపాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. మూడు రోజుల రిటర్న్ పాలసీ సదుపాయంలో భాగంగా కొన్ని మోడళ్ల వాహనాలపై మరో రూ.2 వేల క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. పరిమిత కాలపు ఈ ఆఫర్లు నవంబర్ 14 వరకే వర్తిస్తాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 500 డీలర్ల నుంచి ఈ ఆఫర్లను పొందవచ్చని హీరో ఎలక్ట్రిక్ సంస్థ పేర్కొంది. లీడ్యాసిడ్ స్కూటర్ల మోడల్స్పై రూ.3,000 డిస్కౌంట్ అందిస్తుండగా.. ఇతర ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5000 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. లిథియం ఐయాన్తో పాటు లీడ్ యాసిడ్ ఇ-స్కూటర్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే.. ఇటీవల విడుదల చేసిన ఆప్టిమా హెచ్ఎక్స్ సిటీ స్పీడ్ (Optima HX City Speed), ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ సిటీ (Nyx HX City) స్కూటీలకు ఈ ఆఫర్లు వర్తించవని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఈ వాహనాల ధరలు వరసగా రూ.57,560, రూ.63,990గా ఉన్నాయి. దీపావళి పండగ సీజన్ను పురస్కరించుకొని ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. ఈ పండగ సీజన్లో తక్కువ ధరకే ఇ-స్కూటర్లను సొంతం చేసుకోవచ్చునని ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్లతో ఎలక్ట్రిక్ స్కూటీల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని Hero Electric సంస్థ భావిస్తోంది. Also Read: Must Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mHES0c
No comments:
Post a Comment