Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 2 November 2020

వుహాన్ వెళ్లిన విమానంలో 19 మంది భారతీయులకు కరోనా

భారత్‌ నుంచి చైనాలోని వెళ్లిన ఓ విమానంలో 19 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా.. కరోనా వైరస్ జన్మస్థానమైన వుహాన్‌ నగరానికి న్యూఢిల్లీ నుంచి అక్టోబర్‌ 30న ఎయిరిండియాకు చెందిన విమానం 277 మంది ప్రయాణికులతో బయల్దేరి వెళ్లింది. వుహాన్ విమానాశ్రయం చేరుకోగానే.. అక్కడ వారందరికీ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఆ విమానంలో ప్రయాణించిన వారిలో 19 మందికి పాజిటివ్‌గా తేలగా.. మరో 40 మందిలో యాంటీ బాడీలు గుర్తించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ బారినపడ్డ వారందరినీ హాస్పిటల్‌కు తరలించినట్టు భారతీయ అధికారులు వెల్లడించారు. యాంటీ బాడీలు గుర్తించిన వారిని కూడా హాస్పిటల్‌కు తరలించే అవకాశం ఉందని వారు తెలిపారు. నవంబర్‌ 13 నుంచి మరో నాలుగు విమానాలు వుహాన్‌కు నడపాలని కేంద్రం ప్రకటించిన వేళ ఈ అంశం అలజడి రేపుతోంది. నవంబర్‌ 13, 20, 27, డిసెంబర్‌ 4 తేదీల్లో మరో నాలుగు విమానాలను వుహాన్‌కు నడపాలనుకుంటున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ సోమవారమే (నవంబర్ 2) తెలిపింది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం వివిధ దేశాలకు దశల వారీగా విమాన సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకున్న లక్షలాది మందిని స్వస్థలాలకు చేర్చారు. Must Read: Don't Miss:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3oOE6R1

No comments:

Post a Comment