Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 2 November 2020

ప్రేమించి పెళ్లి.. ఆ సమయంలో భార్యకు వాట్సాప్ కాల్ రావడంతో.. దారుణం!

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పెళ్లయిన మూడు నెలలకే భర్త దారుణంగా హతమార్చాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ష శర్మ (23), అన్షు (22) మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అన్షుకు హర్షతో పరిచయం కాకముందు సచిన్ అనే యువకుడితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా ఆ నిశ్చితార్థం ఆగిపోయింది. తర్వాత అన్షు.. హర్ష శర్మతో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. అయితే తనతో పెళ్లి తర్వాత కూడా సచిన్‌తో అన్షు సన్నిహితంగా ఉంటోందని హర్ష అనుమానించాడు. ఇదే విషయంలో హర్ష, అన్షు మధ్య తరచుగా గొడవలు జరగం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అక్టోబర్ 27న కూడా ఇదే విషయమై గొడవ పడ్డారు. ఈ సందర్భంలోనే అన్షుకు ఓ వాట్సప్ కాల్ వచ్చింది. అయితే ఆ కాల్ చేసింది సచినే అని భావించిన హర్ష పట్టలేని కోపంతో అన్షు గొంతు నులిమి హతమార్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షను అదుపులోకి తీసుకున్నారు. కాగా, హర్ష స్థానికంగా ఉన్న ఓ సీనియర్ రాజకీయ నాయకుడి బంధువుగా భావిస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/361fpIB

No comments:

Post a Comment