Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 2 November 2020

మా గాయాలకు ఉప్పు రాయకండి: పుల్వామా అమరవీరుడి భార్య భావోద్వేగం

రాజకీయం ఎంతకైనా తెగిస్తుంది. బిహార్ ఎన్నికల వేళ పుల్వామా గాయాన్ని మళ్లీ లేపింది. పాకిస్థాన్ ప్రకటన దీనికి మరింత ఆజ్యం పోసింది. దీంతో పుల్వామా అమరవీరుల కుటుంబసభ్యుల గుండె చెరువవుతోంది. మానిన గాయాన్ని మళ్లీ రేపడమే కాకుండా.. అమరవీరుల త్యాగాలను చులకన చేసేలా మాట్లాడటం వారిని కుంగదీస్తోంది. సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై అమరవీరుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు సాయం చేయకున్నా పర్వాలేదు గానీ, మా గాయాలకు ఉప్పు మాత్రం రాయకండి అంటూ Times Now ప్రతినిధితో మాట్లాడుతూ వారు కన్నీరు పెట్టుకున్నారు. పాకిస్థాన్ నేతృత్వంలోనే పుల్వామా ఉగ్ర దాడి జరిగినట్లు రుజువైనందున కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని అమర సైనికుడు నసీర్ అహ్మద్ సతీమణి షాజియా కౌసర్ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్ష పార్టీలకు నా అభ్యర్థన ఒకటే.. ఈ మురికి రాజకీయాలను ఆపండి. ఇలాంటి ఆరోపణలు మన బాధను మరింత పెంచుతాయి’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ షాజియా భావోద్వేగంగా చెప్పారు. పాకిస్థాన్ సిగ్గు పడాలి.. పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్థాన్ చేసిన ప్రకటన పైనా షాజియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కుట్ర సిద్ధాంతాన్ని ఇటువైపు తిప్పడం ద్వారా వారు మా గాయాలకు ఉప్పు రాస్తున్నారు’ అని ఆమె మండిపడ్డారు. పుల్వామా దాడిని తమ ప్రభుత్వ ఘన విజయంగా చెప్పుకున్న పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదురిపై షాజియా తల్లి జుబేదా మరింత ఆగ్రహం వ్యాక్తం చేశారు. ‘పాకిస్థాన్‌ సిగ్గు పడాలి. నిరాయుధులైన సీఆర్పీఎఫ్ జవాన్లను చంపడం వారికి ఎలా పెద్ద విజయం అవుతుంది? మీ అనుకూలవాదులు వెన్నుపోటు పొడవడం 40 కుటుంబాలను అనాథలుగా మార్చింది. ఉగ్రవాదులకు అంటకాగడం, వారిని ప్రోత్సహించడం ఇకనైనా మానేయండి’ అని జుబేదా మండిపడ్డారు. ‘జవాన్ల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడకండి’ అని మరో అమరవీరుడు రవి కుమార్ సోదరి సిమ్మి పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలు మాకు మంచి చేయలేకపోయినా పర్వాలేదు. కానీ, మన జవాన్ల శౌర్యాన్ని రాజకీయం చేయడం ద్వారా మన ప్రియమైనవారి త్యాగాన్ని తక్కువ చేయకుండా ఉంటే చాలు’ అని ఆమె అన్నారు. అసలేం జరిగింది? పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బీకే హరప్రసాద్‌ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. CRPF జవాన్లపై జరిగిన దాడితో బీజేపీ లాభపడిందంటూ అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. పాక్ పార్లమెంట్‌లో మంత్రి ప్రకటన అనంతరం ఈ అంశాన్ని బీజేపీ మరోసారి లేవనెత్తింది. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో అధికార పార్టీ కుట్ర ఉందంటూ ఆరోపించిన వారు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన గుజరాత్‌ పర్యటన సందర్భంగా, బిహార్ ఎన్నికల ప్రచారంలోనూ పుల్వామా అంశాన్ని ప్రస్తావించారు. తర్వాత ప్రతిపక్షాలు చేసిన ‘అసహ్యకరమైన వ్యాఖ్యలు, ఆరోపణలను’ దేశం ఎప్పటికీ మరచిపోదని మోదీ విరుచుకుపడ్డారు. గతేడాది ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా.. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. Also Read: Don't Miss:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mNkKtN

No comments:

Post a Comment