Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 2 February 2021

రాముడి ఇండియాలో రూ.93, సీతాదేవి నేపాల్‌లో 53.. ఇక లంకలో; పెట్రోల్ ధరపై పేలుతున్న సెటైర్

రాముడి ఇండియాలో రూ.93. సీతాదేవి నేపాల్‌లో రూ.53. రావ‌ణుడి లంక‌లో రూ.51. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వేసిన సెటైర్ ఇది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్థాయిలో విమర్శలు కురిపించింది బీజేపీ పార్టీకి చెందిన ఎంపీయే కావడం మరో విశేషం. ఆయనే . ప్రతిపక్షమైనా, సొంత పక్షమైనా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆయ‌న.. పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లపై చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరల ప్రభావం అటు కూరగాయలు, నిత్యావసరాలపైనా పడుతోంది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ ధరలు కూడా కొండెక్కాయి. ఇది సామాన్యుడికి మరింత భారంగా మారింది. ఇంధన ధరలు తగ్గించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏవైనా చర్యలు చేపడుతుందని ఆశించినా.. అలా జరగలేదు. పెట్రోల్ ధర అతి త్వరలో రూ.100కు చేరనుంది. దీంతో సామాన్యుడిలో నైరాశ్యం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.76.48గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.86 ఉండగా, డీజిల్ ధర రూ.83.30కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77గా, లీటర్ డీజిల్ ధర రూ.83.46 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.69గా, డీజిల్ ధర రూ.85.85గా ఉంది. Also Read: ✦ ✦ ✦


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36zC7IK

No comments:

Post a Comment