ఈ రోడ్ల వల్లే చుట్టాలు రావడం లేదు… చిన్నారి రిపోర్టింగ్

కెమెరా అరచేతిలో ఇమిడిపోవడంతో చాలా వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. క్షణాల్లో అందరి కళ్ల ముందు ప్రత్యక్షమైపోతున్నాయి. అందులో కొన్ని ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు. కొన్ని నవ్విస్తాయి.. కొన్ని మంచి మెసెజ్‌ను అందిస్తాయి. ఇప్పుడు కూడా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అధ్వానమైన రహదారులపై ఓ చిన్నారి చేతిలో మైక్ పట్టుకుని రిపోర్టింగ్ చేసింది. ఆ వీడియో చూపరులను తెగ ఆకట్టుకుంటుంది. కశ్మీర్‌లో రోడ్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి ఓ చిన్నపాప రిపోర్టర్‌ అవతారం ఎత్తింది. రోడ్లు ఎంత మురికిగా ఉన్నాయో, అందరూ అక్కడే ఎలా చెత్త పారేస్తున్నారో తన మాటలతో వివరించింది. పైగా రోడ్లు ఇలా ఉండడం వల్ల ఇంటికి చుట్టాలు, స్నేహితులు రావడం లేదని కూడా వాపోయింది. రహదారి గుండా ప్రయాణిస్తూ.. అక్కడ మురికిని చూపిస్తూ ప్రతి విషయాన్ని వివరించింది. అచ్చం రిపోర్టర్‌‌లు చివరిలో చెప్పినట్టు కెమెరామెన్‌ అమ్మతో అని ముగించింది. ఆ పాప చెప్పినట్టుగానే అక్కడ రోడ్డు ఓ మురికి కాలువలాగానే ఉంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆ రోడ్డు గురించి చెప్పడంతో చాలామంది ఆ పాప మాటలకు ఫిదా అయిపోతున్నారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆ చిన్నారిని ప్రసంశించకుండా ఉండలేకపోతున్నారు. ఎంతో అనుభవం ఉన్న రిపోర్ట‌ర్‌లాగానే సమస్యను వివరించిందని పొగుడుతున్నారు. పైగా తర్వాత వీడియోలో ఏ సమస్య గురించి తెలియజేస్తుందోనని అంటున్నారు. కాగా ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కువడంతో రోడ్లు బురదగా మారి అత్యంత అధ్వానంగా ఉన్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3JZNlrX

Post a Comment

0 Comments