Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 February 2022

200 మంది ఎమ్మెల్యేలకు గిఫ్ట్‌గా ఐఫోన్ 13.. రాజస్థాన్ సర్కారు బంపరాఫర్!

ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఐఫోన్-13‌లను బహుమతిగా ఇచ్చింది. గతేడాది బడ్జెట్ సందర్భంగా గెహ్లాట్ సర్కారు ఐప్యాడ్‌లను కానుకగా అందజేసింది. సాధారణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లే సమయంలో వారికి బడ్జెట్‌ కాపీని బ్రీఫ్‌కేస్‌లో అందజేస్తారు. కానీ ఈసారి లెదర్ బ్రీఫ్‌కేస్ లోపల బడ్జెట్ కాపీతో పాటు ₹ 75,000-1 లక్ష విలువైన ఐఫోన్-13‌ను ఉంచారు. ఈ కానుకల కోసం రాజస్థాన్ ప్రభుత్వం దాదాపు రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసింది. ప్రభుత్వం ఐఫోన్ 13లను అందజేయడంతో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఐఫోన్‌లను ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తారని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ప్రకటించారు. మొత్తం 200 సభ్యులున్న రాజస్థాన్‌లో బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ‘‘బీజేపీలోని పలువురు ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన ఐఫోన్‌లను మా ఎమ్మెల్యేలు అంతా వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం.. ప్రభుత్వానికి ఆర్ధిక భారం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు. వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రజాకర్షక పథకాలకు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. విద్యుత్ ఛార్జీల తగ్గింపు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో పేదలకు కూడా వర్తింప జేయనున్నట్టు తెలిపారు. 100 రోజుల పనిదినాలకు నిధులు కేటాయించింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. గత బీజేపీ ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నుంచి 30 శాతాన్ని పెన్షన్ ఖాతాలకు జమచేసేలా నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం దానిని రద్దుచేసిన గెహ్లాట్ సర్కారు.. సంప్రదాయ విధానంలో పెన్షన్ అందజేస్తామని తెలిపింది. అంతేకాదు, తొలిసారిగా సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రవేశపెట్టారు. రైతుల ఆదాయం పెంపు కోసం 11 మిషన్లను చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం బడ్జెట్‌పై పెదవి విరిచింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/HBr6Wv9

No comments:

Post a Comment