Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 18 February 2022

8వ నెలలో అబార్షన్… అనుమతి ఇచ్చిన కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా హైకోర్టు గురువారం 35 వారాల గర్భిణికి అబార్షన్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఓ మహిళ తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. సంబంధిత పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం గర్భాన్ని తొలగించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం కేవలం 24 వారాల గర్భాన్ని మాత్రమే అబార్షన్ చేయించుకునే ఛాన్స్ ఉంది. అయితే మహిళకు ఉండే అనారోగ్య సమస్య కారణంగా కోర్టు ఈ పర్మిషన్ ఇచ్చింది. అనుమతి కోరిన 36 ఏళ్ల మహిళకు కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆమెకు అనేక అనారోగ్య సమస్యలున్నాయి. అయితే చాలాకాలానికి ఆమె ప్రెగ్నెంట్ అయింది. అయితే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె అనారోగ్య సమస్యలు ఇంకా పెరిగాయి. తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఆమె అబార్షన్‌ కోసం అనుమతులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే మహిళ మెడికల్ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు ఒప్పుకుంది. అయితే 8వ నెలలో అబార్షన్‌ చేయడం ప్రాణాంతకం అని డాక్టర్లు అంటున్నారు. సాధారణంగా గర్భం దాల్చిన మూడు నెలల్లో అబార్షన్ చేయడం వల్ల మహిళ ప్రాణానికి ఎటువంటి ముప్పు ఉండదు. అదీ కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో డాక్టర్లు చేస్తుంటారు. అబార్షన్‌లు చేయడం చట్టా రీత్యా నేరం. కానీ ఈ కేసులో కోర్టు అసాధారణమైన తీర్పునిచ్చింది. అయితే గతంలో కూడా కొన్ని కేసుల్లో కోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/kgLvzGS

No comments:

Post a Comment